Breaking News
Friday, January 16, 2026
Breaking News

కేజీవీల్స్ తో రోడ్డు పై నడుస్తున్న ట్రాక్టర్ పట్టివేత

కేజీవీల్స్ తో రోడ్డు పై నడుస్తున్న ట్రాక్టర్ పట్టివేత

సుల్తానాబాద్,జనవరి 7(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో కేజీవీల్స్ తో రోడ్డుపై నడుస్తున్న ట్రాక్టర్‌ను ఎస్సై చంద్రకుమార్ పట్టుకున్నారు. అట్టి ట్రాక్టర్ సుద్దాల గ్రామానికి చెందిన ఒజ్జ హరీష్ దిగా గుర్తించారు. ఈ విధంగా రోడ్లపై కేజీవీల్స్ తో ట్రాక్టర్ లు నడపడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయని,దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కావున ఎవరూ కూడా కేజీవీల్స్ తో రోడ్ల పైకి రాకూడదని, ఒకవేళ వచ్చినట్లయితే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని ఎస్సై చంద్రకుమార్ హెచ్చరించారు.ఇట్టి విషయంలో రైతులు, ట్రాక్టర్ యజమానులు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.ఇట్టి ట్రాక్టర్ ను తదుపరి చర్యల కోసం  సుల్తానాబాద్ తహసిల్దార్‌ భషిరోద్దీన్ అప్పగించగా ట్రాక్టర్ యాజమానికి 5000 జరిమాన విధించారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!