Breaking News
Sunday, January 18, 2026
Breaking News

గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య కు పితృ వియోగం 

జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతటి అన్నయ్య కు పితృ వియోగం

సుల్తానాబాద్, డిసెంబర్ 16(కలం శ్రీ న్యూస్):

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కురువృద్ధ నేత గుండెపోటుతో మృతి. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. అంతటి రాయలింగు గౌడ్ దివంగత మాజీ సర్పంచ్ గరిగే మధురయ్య సర్పంచ్ గా ఉన్న సమయంలో ఉప సర్పంచ్ గా 11 సంవత్సరాలు పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్నోసార్లు వార్డు సభ్యులుగా పనిచేసి ప్రజలకు సేవ చేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు గౌడు ఇక లేరన్న వార్తతో సుల్తానాబాద్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ వాదిగా అంతటి రాయలింగు ప్రస్థానం తో సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు. అంతటి రాయలింగు గౌడ్ మరణం దిగ్బ్రాంతిని చేకూర్చింది.విషయం తెలుసుకున్న వెంటనే రాజకీయ నాయకులు, వ్యాపారులు,వివిధ పార్టీ నేతలు ఆయన పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!