Breaking News
Friday, January 16, 2026
Breaking News

సుల్తానాబాద్ లో బిసి బంద్ ప్రశాంతం

సుల్తానాబాద్ లో బిసి బంద్ ప్రశాంతం

పెద్ద సంఖ్యలో పాల్గొన్న పలు పార్టీల నేతలు 

ర్యాలీ, రాస్తారోకో, ధర్నా లతో దద్దరిల్లిన నినాదాలు 

సుల్తానాబాద్, అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్): బీసీలకు రాజ్యాధికారం కావాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ మండలంలో విజయవంతమైంది. 56% ఉన్న బీసీలకు చట్టసభ లతో పాటు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 42% కల్పించాలని ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో భాగంగా శనివారం మండలంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బహుజన సమాజ్ పార్టీ లతోపాటు, అన్ని కుల సంఘాల నాయకులు బందు లో పాల్గొన్నారు. ఉదయం నుండి పట్టణంలో కలియ తిరిగిన అఖిలపక్షం నేతలు వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు, సినిమా హాల్, పాఠశాలలను మూయించి వేశారు. పట్టణంలో ర్యాలీగా తిరిగిన అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ, అత్యధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి బీసీ లందరూ మద్దతుగా నిలవాలని, బీసీల ఐక్యతను సాధించేంతవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలన్నారు. 42 శాతం ఖచ్చితంగా అమలు చేసి తీరే విధంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు అఖిలపక్షం నేతలు పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ .సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శ్రావణ్ కుమార్ భారీ బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలు పార్టీ నేతలు,పలు సంఘాల నాయకులు,వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!