Sunday, September 8, 2024
Homeదేశంరేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది

ఒడిశా,జులై 17(కలం శ్రీ న్యూస్):

ఒడిశాలోని పూరీ జగన్నాధుని శ్రీ క్షేత్రరత్న భాండాగారం రహస్య గది తలుపు లు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు రేపు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

సమావేశం అనంతరం జస్టిస్‌ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌ రూంకు తరలించమన్నారు..

ఇదంతా వీడియోగ్రఫీ చేయించామని,ఈనెల 18 న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తామని, అనంతరం ఈ భాండాగారాన్ని పురావస్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తామన్నారు.

పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామని వెల్లడించారు.రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపి వేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!