అకాల వర్షం అపార నష్టం
క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్న బిజెపి నేతలు
ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
ఎండపల్లి ఎప్రిల్26 (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో బుధవారం రోజున బీజేపి జిల్లా ఉపధ్యక్షుడు గాజుల మళ్లేశం క్షేత్రస్థాయిలో వరి పంటలను, మామిడి తోటలను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపి పార్టీ పిలుపుమేరకు అకాల వర్షం వడగండ్లతో నష్టపోయిన మామిడి పంట, వరి పంట, నష్టపోయిన రైతులకు 50వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బిజెపి పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మూర్చా మండల అధ్యక్షుడు హన్మంత రావు, దళిత మోర్చ మండల అధ్యక్షుడు న్యాతరి మల్లేశం, జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడు దుర్గం రమేష్, కుషన పెళ్ళి నరేష్, గాజుల స్వామి భూపతి తిరుపతి, బుసారపు బీమయ్య, గాజుల నరేష్, దుర్గం కిరణ్, జాడి రాజు, బిజెపి నేతలు, గ్రామ రైతులు, పాల్గొన్నారు.