కోటిలింగాలలో శంకర జయంతి సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
జగిత్యాల ఎప్రిల్ 25 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం లోని కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి పురస్కరించుకొని మంగళవారం రోజున శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి వెల్గటూరు, ఎండపల్లి మండలాల భారాస పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.