ధర్మపురి నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల, మార్చి 15(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గమును ఏకగ్రీవ ఎన్నిక బుధవారం రోజున చర్లపల్లి గ్రామంలో సీయోను ప్రార్థన మందిరంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సిహెచ్. సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ ఎన్నిక నిర్వహణ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ జి.మధు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రెవరెండ్ ఈ. శ్రీనివాస్ ల సమక్షంలో నిర్వహించారు.
ఎన్నికలో అధ్యక్షుడు గా రెవరెండ్ బి. యోహన్, ఉపాధ్యక్షుడు గా రెవరెండ్ సిహెచ్. సాగర్, ప్రధాన కార్యదర్శి గా రెవరెండ్ డి. సోలోమోను రాజు, సంయుక్త కార్యదర్శి గా రెవరెండ్. యం. మహేష్, కోశాధికారి గా రెవరెండ్ డి. కృపాదానం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా రెవరెండ్ సిహెచ్. రాజరత్నం, పాస్టర్ సిహెచ్. రాజు , ఎండపల్లి మండలం లోని సేవకులు ఎన్నికలో పాల్గొన్నారు.