Thursday, September 19, 2024
Homeతెలంగాణవెల్గటూరు లో బీజేకేఎం రైతు దీక్ష విజయవంతం 

వెల్గటూరు లో బీజేకేఎం రైతు దీక్ష విజయవంతం 

వెల్గటూరు లో బీజేకేఎం రైతు దీక్ష విజయవంతం 

 

జగిత్యాల, మార్చి10 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు దీక్ష కార్యక్రమం శుక్రవారం రోజున వెల్గటూరు మండల భారతీయ జనతా కిసాన్ మోర్చ అధ్యక్షుడు రావు హన్మంత రావు అధ్వర్యం లో భాజపా పార్టీ నిర్వహించింది.

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయిల వ్యవసాయ రుణమాఫి హామీని వడ్డీ తో సహా వెంటనే అమలు చేయాలని, ధరణి పోర్టల్ తో రైతాంగం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని, రైతులకు నిరాటంకంగా నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలి, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రం లో అమలు చేయాలని భాజపా ప్రభుత్వం ని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ కొమ్ము రాంబాబు యాదవ్, కిసాన్ మోర్చ జిల్లా కోశాధికారి గొంటి అనంద్, కిసాన్ మోర్చ మండల నాయకులు బుద్ధె పోచయ్య ( బాపు), మల్లయ్య, జిల్లా నాయకుల దుర్గం రమేశ్, సుధాకర్, బిజెపి మండల నాయకులు జనార్దన్, వెంకటగిరి, దేశ్ముఖ్, మందపల్లి శ్రీనివాస్, గంగాధర్ తదితరుల పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!