మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా వీరస్వామి ఎన్నిక
సుల్తానాబాద్, జనవరి 28(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘము నూతన అధ్యక్షునిగా ఐలవేణి వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సంఘం ఉపాధ్యక్షుడిగా నరేందర్ కార్యదర్శిగా మొగిలి ఎన్నికవ్వగా డైరెక్టర్లుగా నాగుల కుమారస్వామి, ఐలవేణి కుమారస్వామి, మొండయ్య, కనుకయ్య, శ్రీనివాస్ రాజమల్లు ఎన్నికయ్యారు.నూతన అధ్యక్షుడు వీరస్వామి మాట్లాడుతూ సహకారం సంఘం సభ్యులకు ముదిరాజ్ గంగపుత్ర కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు..