పెద్దపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి.
గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బీజేపీ లో చేరిన వివిధ పార్టీల నాయకులు
పెద్దపల్లి,జనవరి28(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా పెద్దపల్లి పట్టణంలోనే కాకుండా పెద్దపల్లి అసెంబ్లీ, పార్లమెంట్ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేసే కార్యక్రమంలా అనిపిస్తుందని, గ్రామ గ్రామాన తిరుగుదామని, ప్రజల సమస్యలు తెలుసుకుందామని, ప్రజలతో ఉందామని, ప్రజలతో మమేకమై కార్యకర్తలకు ప్రజలకు తోడుగా నిలిచి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దామని,గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న మాకు చెప్పండి మేము తోడుగా ఉంటాం, తప్పకుండా పెద్దపల్లి గడ్డపై కాషాయ జెండాను ఎగరవేసి ప్రజలకు ప్రజా ప్రభుత్వాన్ని అందించేందుకు కృషి చేయాలని, కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు తెలపడం జరిగింది.
ఈసందర్భంగా వునుకొండ శ్రీదర్ పటేల్ ఆధ్వర్యంలో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ల సమక్షంలో వునుకొండ తిరుపతి, బత్తుల ప్రశాంత్, తూముల రవితేజ, పొడిశెట్టి వేణుగోపాల్, అడప భాను తేజ, వునుకొండ మహేష్ వల్లే వంశీ, పినుముల ప్రఫుల్ల , హర్షదీప్, సాయి గణేష్, సిద్దు, శివారెడ్డి, సతీష్, అభి లతో పాటు దాదాపు 200 మంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
ఈకార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు ఉప్పు కిరణ్, బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ లు సయ్యద్ సజ్జాద్, కట్కూరి సుధాకర్ రెడ్డి, ప్రమోద్ కుమార్, మాజీ ఎంపీటీసీ సోడబాబు, మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఫయాజ్ ,అడ్డగుంట శ్రీనివాస్, బాలసాని సతీష్, కరుణాకర్, గంగుల సతిష్-సంతోష్, వునుకొండ తిరుపతి, భూమయ్య, ఐద తిరుపతి, కల్వల శ్రీనివాస్, తూముల రాజేశ్,బండి రాజేష్, ,లార్డ్స్ లక్ష్మణ్ , తీగల అశోక్, జక్కుల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.