గుడుంబా విక్రయ పదార్థాలు అమ్మిన వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా
సుల్తానాబాద్, జనవరి26,(కలం శ్రీ న్యూస్) : గుడుంబా తయారీకి అవసరమైన విక్రయపదార్థాలను అమ్మిన వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ సాముల్ ఆనందరావు తెలిపారు. ఓదెల మండలం లోని ఓదెల గ్రామానికి చెందిన వ్యాసం రమేష్ గతంలో బైండోవర్ చేయగా బైండోవర్ ఉల్లంఘనకు పాల్పడడంతో లక్ష రూపాయలు ఓదెల తహశీల్దారు కార్యాలయంలో ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు .