Sunday, September 8, 2024
Homeతెలంగాణగుండె పోటు తో విలేఖరి మృతి.. అధికారుల, విలేఖర్ల సంతాపం

గుండె పోటు తో విలేఖరి మృతి.. అధికారుల, విలేఖర్ల సంతాపం

గుండె పోటు తో విలేఖరి మృతి.. అధికారుల, విలేఖర్ల సంతాపం

జగిత్యాల ఎప్రిల్ 17(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రజాసాక్షి ఆర్సీ విలేఖరి వడ్లకొండ శ్రీనివాస్ సోమవారం గుండె పోటుతో మృతి చెందారు. మేడిపల్లి మండలం లోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ కు ఇంటి వద్దనే గుండె పోటు రాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోగానే మార్గం మధ్య లోనే మరణించారు. మృతుడు శ్రీనివాస్ గత కొన్నేళ్ళుగా అనేక పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసి దుబాయ్ వెళ్లి వచ్చిన అనంతరం తిరిగి పత్రికా రంగంలో ప్రవేశించారు. మృతుడు గ్రామీణ వైద్యులుగా కూడా పని చేస్తారు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!