Sunday, September 8, 2024
Homeతెలంగాణరోటు వెయిటర్ దొంగ అరెస్ట్ 

రోటు వెయిటర్ దొంగ అరెస్ట్ 

రోటు వెయిటర్ దొంగ అరెస్ట్ 

సుల్తానాబాద్,జులై13(కలం శ్రీ న్యూస్):

వ్యవసాయ పనులకు వినియోగించే రోటు వెయిటర్ ను దొంగలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు మాజీ దొంగ.సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి కథనం ప్రకారం  ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా తిరుపతి రెడ్డి పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని అలాగే కొలనూరు లో 10 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నాడని నిత్యం, వ్యవసాయ పనులకు సుల్తానాబాద్ లో నివసిస్తూ తిరుపతి రెడ్డి రాకపోకలు సాగిస్తుండగా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో తొగరి అశోక్ వ్యవసాయ భూమి వద్ద శక్తిమాన్ కంపెనీకి చెందిన లక్ష పదివేల రూపాయల రోట్ వెయిటర్ కనిపించడంతో దొంగలించాలనే ఆలోచన రాగ కొత్తపల్లిలో ఉన్న తన ట్రాక్టర్ ను సుద్దాల గ్రామానికి తీసుకువచ్చి అశోక్ వ్యవసాయ పొలంలో ఉన్న రోటు వెయిటర్ ను ట్రాక్టర్ కు తగిలించుకొని వెళ్లాడని సీఐ వివరించారు. శనివారం పోలీసులు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ సమీపాన వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ కు రోటు వెయిటర్ తగిలించుకొని వెళుతున్న తిరుపతి రెడ్డి అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ కి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసుకొని   రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు కృషిచేసిన ఎస్సైలు శ్రవణ్ కుమార్, నరేష్, ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్ రమేష్ లను సీఐ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!