Sunday, September 8, 2024
Homeతెలంగాణఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత 

ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత 

ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత 

హైదరాబాద్,జూన్8(కలం శ్రీ న్యూస్):ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 5వ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈరోజు తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!