ధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం అందజేత
సుల్తానాబాద్,మార్చి15(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో గల శ్రీ ధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం నిమిత్తం సుల్తానాబాద్ వాస్తవ్యులు వాసాల శ్రీలత శ్రీనివాస్ కుమారుడు వాసాల సాయి మాధవ పుట్టినరోజు సందర్భంగా గోవుల కు 50- కేజీల దాన అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుమార్తె వాసాల శ్రీవాణి గోశాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి సూర్య, బండారి భాగ్యలక్ష్మి, ఎనగందుల శివకృష్ణ, జాకీ రమేష్, నూక రామదాస్, గుండా రవీందర్ పాల్గొన్నారు. దాతకు గోశాల ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.