ఉచిత వైద్య శిబిరం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 25(కలం శ్రీ న్యూస్): ఆవో గావో ఛలో (పదండి పల్లెకి పోదాం) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ వారి సౌజన్యంతో సాయి శరణ్య హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో సర్పంచ్ కుంట రాజు అధ్యక్షతన కరీంనగర్ పట్టణంలోని సాయి శరణ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు బ్లడ్ షుగర్,బీపీ,గుండె పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు,చెవి,ముక్కు గొంతుకు సంబంధించిన పరీక్షలు, వినికిడి పరీక్షలు,ఆడియో గ్రామ్ నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. సుమారుగా 500 మంది గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ లక్ష్మీ,లచ్చయ్య,వైద్యులు శైలజ, ప్రవీణ్ కుమార్,కావ్య,అస్మా, సందీప్,రాము,ల్యాబ్ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ ఉదరి శంకరయ్య, మాజీ సర్పంచ్ కండె రమేష్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.