Sunday, September 8, 2024
Homeతెలంగాణబీజేపీ పార్టీలో చేరిన ఈరవేన కుమార్..

బీజేపీ పార్టీలో చేరిన ఈరవేన కుమార్..

బీజేపీ పార్టీలో చేరిన ఈరవేన కుమార్..

మంథని, మే 7(కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన యువ నాయకులు ఈరవేన కుమార్ తో పలువురు యువకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీజేపీ పార్టీ లో చేరారు.వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లో కి ఆహ్వానించారు.. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ పథకలు నచ్చి సునీల్ రెడ్డి నాయకత్వం లో పని చేయాలనీ పార్టీ లో చేరుతున్నట్టు వారు వెల్లడించారు.

అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని, యువత ఎక్కువగా బీజేపీ పార్టీ కి ఆకర్షితులు అవుతున్నారు, బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రానున్న రోజుల్లో మనుగడ లేదని, యువత కి భవిష్యత్తు బీజేపీ లోనే ఉందని, స్వచ్ఛమైన, నీతి వంతమైన రాజకీయం మాసిద్ధాంతం అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని అసెంబ్లీ కొ కన్వీనర్ నాంపల్లి రమేష్, మండల ఇంచార్జ్ లు విరబోయిన రాజేందర్, తోట మధుకర్, మండల ఉపఅధ్యక్షులు రేపాక శంకర్,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, చీదురాల మధుకర్ రెడ్డి, బూడిద తిరుపతి, విద్యసాగర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!