Sunday, September 8, 2024
Homeతెలంగాణమీకోసం ఫౌండేషన్ చైర్మన్ కోడూరి మహేశ్ కు జాతీయ స్థాయి మహానంది అవార్డు ప్రధానం

మీకోసం ఫౌండేషన్ చైర్మన్ కోడూరి మహేశ్ కు జాతీయ స్థాయి మహానంది అవార్డు ప్రధానం

మీకోసం ఫౌండేషన్ చైర్మన్ కోడూరి మహేశ్ కు జాతీయ స్థాయి మహానంది అవార్డు ప్రధానం

జూలపల్లి ఏప్రిల్ 3 కలం శ్రీ న్యూస్

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో చెందిన మీకోసం ఫౌండేషన్ చైర్మన్ కోడూరి మహేశ్ కు సామాజిక సేవా రంగంలో సేవలు అందించినందుకు గాను మహానంది జాతీయస్థాయి మహానంది అవార్డును ప్రధానం చేశారు తెలుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని త్యాగరాయ గాన సభ కళామందిరంలో తెలుగు వెలుగు మహాసభ అధ్యక్షులు రాజ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మహానంది జాతీయ స్థాయి అవార్డులను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత శ్రీ శాంతికృష్ణ ఐఎస్ఎఫ్ అధికారి శ్రీ గామినేని రామలింగం చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం మీకోసం ఫౌండేషన్ చైర్మన్ కోడూరి మహేశ్ కు మహానంది జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్ శాలువాతో కప్పి అవార్డును ప్రధానం చేశారు ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ మహానంది జాతిస్తాయి అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తు సమాజంలో చేస్తున్న సేవను గుర్తించి మహానంది జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణంగా ఉందని అన్నారు ఈ అవార్డు మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు అవార్డు రావడం పట్ల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పోలోజు భాస్కరాచార్యులు, జలమండలి అధికారి మోహన్, రంగు శెట్టి రమేష్, మదన్మోహన్, ఆచార్య మోహన్ రావు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!