Saturday, July 27, 2024
Homeదేశంఅరుణాచలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

అరుణాచలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

అరుణాచలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

శివనామస్మరణతో మార్మోగుతున్న అరుణాచల గిరి

తిరువణ్ణామలై,నవంబర్26(కలం శ్రీ న్యూస్):తమిళనాడులోని తిరువణ్ణామలై లో కార్తీకమాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరులు విద్యుత్‌ దీపాలంకరణ లతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. భక్తులు కాల్చిన బాణాసంచా వెలుగులతో, అరుణాచలం ఆలయ ప్రాకారం, అరుణగిరి ఆథ్యాత్మికతో వెల్లివిరిసాయి.

 

రకరకాల పూలతో అందంగా అలంకరించిన వాహనాలపై అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్‌లను మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల శివనామస్మరణతో అరుణగిరి మార్మోగింది. వేలాదిమంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.

అరుణాచలంలోని కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టం భరణి దీపం. ఈ వేడుకను ఆదివారం ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు.ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు.

కార్తీక దీపోత్సవాల్లో మరో అద్భుత ఘట్టం మహాదీపం. ఈ మహాదీపాన్ని ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై కార్తీక పౌర్ణమి ఘడియల్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తారు.భక్తులు, ఆలయ నిర్వాహకులు ఈ మహాదీపాన్ని శివనామ స్మరణలతో ఊరేగింపుగా కొండపైకి తీసుకు వెళ్లారు. ఈ మహాదీపాన్ని వీక్షించేందుకు అరుణాచలక్షేత్రానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు.ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు.ఈ మహాదీపం కోసం భక్తులనుంచి సేకరించిన 3,500 కిలోల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఆదివారం తెల్లవారుజామున కొండపైకి తీసుకెళ్లారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది.

ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!