Saturday, July 27, 2024
Homeదేశంమా అందరి మద్దతు శ్రీధర్ బాబు కే.

మా అందరి మద్దతు శ్రీధర్ బాబు కే.

మా అందరి మద్దతు శ్రీధర్ బాబు కే.

ముంబయి లోని మంథని ప్రాంత వాసుల మనోగతం.

ముంబయ్,నవంబర్22(కలం శ్రీ న్యూస్):

నవంబర్ 30న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ళ  శ్రీధర్ బాబు కే తామందరి సంపూర్ణ మద్దతు ఉంటుందని మహరాష్ట్ర లోని ముంబయి లో ఉంటున్న మంథని ప్రాంత వాసులు స్పష్టం చేశారు.ముంబాయి పర్యటనలో ఉన్న మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులను పలువురు మర్యాద పూర్వకంగా కలిసి కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వివిధ వృత్తుల్లో ఉండి ముంబయి లో నివాసం ఉంటున్న మంథని మండలం దుబ్బపల్లి, బెస్తపల్లి గ్రామాలకు చెందిన పలువురు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 30న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము స్వగ్రామాలకు విచ్చేసి ప్రజా నాయకుడు శ్రీధర్ బాబు కి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంథని ఎంపిపి కొండ శంకర్, నాగారం సర్పంచ్ బూడిద మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీమ్ ఖాన్ ,ఇనుముల సతీష్ , పర్శ శ్రీనివాస్,కిషన్ నాయక్ లతో పాటు ముంబయిలో ఉంటున్న మంథని ప్రాంత వాసులు మేడి శంకరయ్య, గుమ్ముల లక్ష్మి నారాయణ, కూనారపు వెంకటేష్,మేడి లక్ష్మణ్ , కూనారపు లక్ష్మణ్, మేడి తిరుపతి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!