Sunday, September 8, 2024
Homeతెలంగాణతెలంగాణ ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ

తెలంగాణ ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ

తెలంగాణ ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ

హైదరాబాద్‌,మే 30(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని పలు మార్పులతో ఖరారు చేశారు. తెలంగాణ, అస్థిత్వం, ఆత్మగౌరవం, ప్రతిబింబించేలా 6 నిమిషాల నిడివితో ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని రెండు నిమిషాల 30 సెకన్లకు కుదించారు. తెలంగాణ ఔన్నత్యం, భావం, భావోద్వేగం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సులువుగా రూపొందిం చారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి ఈ గీతానికి స్వరకల్పన చేశారు. అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం తుది రూపం ఖరారైంది. ప్రముఖ చిత్రకారులు రుద్ర రాజేశం తయారు చేసిన 12 చిహ్నాల్లో ఒక దాన్ని ఎంపిక చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన చిహ్నంలో కొన్ని మార్పులు చేయాలని వారికి సూచించారు. గత చిహ్నంలో రాజరిక ముద్ర లకు ప్రతీకగా ఉన్న, కాక తీయ తోరణాన్ని మార్చి ప్రత్యామ్నాయంగా ప్రజా స్వామ్యం, తెలంగాణ ఉద్యమం, త్యాగధనుల బలిదానాలు ప్రతిబింబించేలా కొత్త రూపాన్ని చేర్చనున్నారు. చార్మినార్‌, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులు మొద లైనవి యధాతధంగా ఉండనున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేండ్లు గడుస్తున్న నేపథ్యంలో జూన్‌ 2న సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ సమీక్షలో ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్ర మార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జయజయహే గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఫ్రొఫెసర్‌ కోదండరామ్‌, అద్దంకి దయాకర్‌, సీఎం సలహాదారులు నరెందర్‌ రెడ్డి, జేఏసీ నేత రఘు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!