ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజోత్సవం
సుల్తానాబాద్,డిసెంబర్10(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాటేటి శ్రీనివాస్ గురు స్వామి 18వ సారి మాలాధారణ చేసి శబరిమలై యాత్ర చేయుచున్న సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో అయ్యప్పస్వామి దివ్య పదునెట్టాంబడి మహా పడిపూజా కార్యక్రమంను మాటేటి సంజీవ్ స్వామి, పల్లా అనిల్ కుమార్ స్వాములు సంయుక్తంగా పూజ్య శ్రీ కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరి చేత అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శరణు ఘోష చేస్తూ, సామూహిక భజన సంకీర్తనలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు కావేటి పరమేశ్వర్ స్వామి, మిట్టపల్లి మురళీధర్ స్వామి, కుసుమ ప్రదీప్ కుమార్ స్వామి, సాయిరి మహేందర్ స్వామి, నాయకులు ఐల రమేష్, బుర్ర శ్రీనివాస్, బిరుదు సమతా కృష్ణ, పల్లా సురేష్ పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలాదారులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.