Sunday, September 8, 2024
Homeతెలంగాణమంథని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మానం

మంథని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మానం

మంథని జనవరి 23 (కలం శ్రీ న్యూస్): మంథని నూతనంగా ఎన్నుకోబడ్డ మంథని ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సీనియర్ పాత్రికేయులు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకరి ప్రకాష్ ఘనంగా సన్మానించారు.

https://youtu.be/tVml5Biiztg సోమవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఇటీవలే నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గమైన అధ్యక్షుడు అంకరి కుమార్, ఉపాధ్యక్షుడు మహావది సతీష్, ప్రధాన కార్యదర్శి పోతురాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి బర్ల సంపత్, కోశాధికారి తగరం రాజులను ప్రెస్ క్లబ్ సభ్యుల మధ్య ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకరి ప్రకాష్ వారిని ఘనంగా సన్మానించారు. అలాగే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడైన అంకరి ప్రకాష్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కోమురోజు మారుతి, కొమరోజు చంద్రమోహన్, మోత్కూరి శ్రీనివాస్, రావుల తిరుమల్, లక్కకుల నాగరాజు, వొజ్జల శ్రీనివాస్, సిలివేరి మహేందర్, గంధం ఆంజనేయులు, లింగాల సురేష్, బాసాని సాగర్, బండారి సమ్మయ్య, కేసారపు రవి, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!