క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
మంథని ఏప్రిల్ 5(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం కాకర్లపల్లి లో క్రీస్తు శేషులు మెండె మల్లమ్మ స్మారకార్ధం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్టులకు బుధవారం మొదటి, రెండవ బహుమతులను అందజేశారు. టీడీపీ మంథని నియోజకవర్గం ఇంచార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి, పనకంటి శ్రీధర్ మొదటి కప్ సైలెంట్ కిల్లర్ విజేతలు ఆకుల సాయి టీంకు, రెండవ కప్ బహుమతి 11 మంది రన్నర్లు కెప్టెన్ పైడాకుల హరీష్ టీం లకు అందజేశారు. మొదటి ప్రైజ్ మనీ 10116 లను గెలుపొందిన మొదటి సైలెంట్ కిల్లర్ టీం కు పెద్దపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెండ రాజయ్య అందజేశారు.రెండవ బహుమతి 11 మంది రన్నర్ల కు 5016 లను ఇసెంపల్లి బాపు,సెనం మల్లయ్య లు అందజేశారు.అదే విధంగా బౌలింగ్, బ్యాటింగ్ లో ప్రతిభను కనబర్చినందుకు ఎనగందుల వెంకటేష్,మెండ సాయి కుమార్ లకు 1000 రూ ల ప్రైజ్ మని రిటైర్డ్ ఉద్యోగి కొత్త కొండ భగవంత రావు, కల్వజీ మోహన్ రావు అందజేశారు. అనంతరం మెండ మల్లమ్మ స్మారకర్థం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన ఓదెలు,ఆకుల మల్లయ్య,తన్నీరు లక్ష్మన్,బడుగు మహేష్, భాస్కర్ల శంకరయ్య,క్రీడాకారులు, క్రీడా అభిమానులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.