Sunday, September 8, 2024
Homeతెలంగాణఆకట్టుకున్న ఆత్మీయ సమ్మేళనం 

ఆకట్టుకున్న ఆత్మీయ సమ్మేళనం 

ఆకట్టుకున్న ఆత్మీయ సమ్మేళనం 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని, మార్చి 26(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలో ఆదివారం ఆరెంద గ్రామానికి చెందిన సింగరేణి రైటైర్డు ఆఫీసర్ కొమ్మిడి భూంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పలువురుని ఆకట్టుకుంది. స్థానిక లక్ష్మిభారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చిన్ననాటి మిత్రులు, ఆత్మీయ బంధువుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు పాల్గొన్నారు. మంథని ప్రాంతానికి చెందిన భూంరెడ్డి సింగరేణిలో అనేక ఉన్నత పదువులు చేసి పదవీవిరమణ అనంతరం మంథని ప్రాంతానికి సేవచేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన భూంరెడ్డిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, ఎంపిపి కొండ శంకర్, మాజీ సర్పంచ్ లు మాదాడి ప్రభాకర్ రెడ్డి, ఆరెంద లింగారెడ్డి, పర్స బక్కయ్య, నూకల బానయ్య, కాటారం సింగిల్విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, నాగినేని జగన్మోహన్ రావు, బెల్లంకొండ నర్సింగరావు టిజిబికెఎస్ నాయకుడు రాజిరెడ్డితో పాటు పలువురు సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!