నూతన పెద్దపల్లి డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్
పెద్దపల్లి,జనవరి28,(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జోన్ ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ గా నియమించబడిన వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జోన్ కు చెందిన పోలీస్ అధికారులు డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. డీసీపీ పెద్దపల్లి జోన్ పరిధిలోని పోలీస్ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితులను, ఎక్కువ గా నమోదయి ఉన్నటువంటి కేసుల వివరాలను అడిగి తెలుసుకొవడం జరిగింది. ప్రజల కోసం 24 గంటల పాటు పనిచేసేందుకు అందుబాటులో ఉంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన డీసీపీ ని కల్సి పుష్పాగుచ్చాలను అందజేసిన వారిలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమేష్ బాబు తోపాటు ఎస్సైలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.