బీఆర్ఎస్లో కొనసాగుతున్న చేరికలు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 20(కలం శ్రీ న్యూస్):మహాదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల వైస్ ఎంపీపీ బండం లక్ష్మణ్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మేసినేని వెంకటేశ్వర్రావు,వేంకటేశ్వర స్వామి ఆలయం చైర్మెన్ పలినెని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లికి చెందిన 50మంది చేరగా వారికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.నియోజవకర్గంలో జెడ్పీ చైర్మన్గా పుట్ట మధూకర్ చేస్తున్న అభివృధ్ది,సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని,రాబోయే ఎన్నికల్లో పుట్ట మధూకర్ గెలుపు కోసమే పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.పార్టీలో చేరిన వారిలో బ్రాహ్మణపల్లికి చెందిన వార్డు సభ్యులు బంధు రాజయ్య,బందు రమేష్,నాయకులు మేసినేని గోపాలరావు,బందు లింగయ్య, బొందిలి రామ్మూర్తి, శ్యామని నరేష్,వర్ణం శ్రీను,శ్యామని రవి,కొండగొర్ల పవన్,ఎరివెల్లి మల్హల్రావు,మండపు స్వామి,దయ్యం మల్లయ్య,మండపు రాజయ్య,మండపు కిషన్, అబ్బినేని శివ,అట్టెం శ్రీకాంత్,శీలం చందు,అంబాల లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, చంద్రగిరి నరేష్, పెర్క రాకేష్,పుట్టపాక శివ,పేట రాజయ్య, ఏట సురేష్, పేట కార్తీక్, అంబాల బాలయ్య, కొయ్యల రవి, ఎనుగందుల మల్లయ్య, ఎనుగందుల మహేష్, బందుసాయి,అట్టెం పోతరాజుతో పాటు తదితరులు ఉన్నారు.