గుమ్మునూరు గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 14( కలం శ్రీ న్యూస్):ఏఐసీసీ సెక్రెటరీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మంథని మండలం గుమ్మనూరు గ్రామం లో గడపగడపకు కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు.కాంగ్రెస్ ను ఆదరించండి అంటూ పార్టీ శ్రేణులు ప్రచారం చేశారు.గడపగడపకు తిరుగుతూ ఆ పార్టీ ప్రకటించిన కాంగ్రెస్ అభయ హస్తం,ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కోసం ఐదు లక్షల రూపాయలు,ప్రతి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిందర్,మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, భూమిలేని వారికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు,ఒకే కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు మరియు నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజప్రతినిధులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.