భీం ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మహాజన సోషలిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ.
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 29(కలం శ్రీ న్యూస్):ఉత్తర ప్రదేశ్ లోని దళిత ఉద్యమ నేత,పీడిత వర్గాల ముద్దు బిడ్డ,చంద్ర శేఖర్ ఆజాద్ (రావణ్) పై అక్కడి సహారాన్ పూర్ పట్టణం లో కాల్పులు జరిపి, చంపడానికి ప్రయత్నం చేయడం దారుణం అని గుర్తు చేస్తున్నాం.ఈ దారుణ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నాం అని మహాజన సోషలిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ అన్నారు.పీడిత వర్గాల ప్రజలకోసం తెగించి పోరాడే ఉద్యమ వీరులను చంపాలని చూడడం దారుణమైన, హేయమైన చర్య అని ఈసంఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.చంద్రశేఖర్ ఆజాద్ (రావణ్) త్వరగా కోలుకోవాలని తిరిగి ప్రజా పోరాటంలోకి రావాలని కోరుకుంటున్నామని అన్నారు.