మంథనిలోని 11వ వార్డులో 4వ రోజు కొనసాగిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 25(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణములోని మర్రివాడలో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి నినాదంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పారదర్శక పాలనను వివరించి ప్రతి ఇంటికి నరేంద్రమోడీ పథకాలను వివరించడం జరిగింది.పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,సీనియర్ నాయకులు ఎడ్ల సదశివ్,రాపర్తి సంతోష్,ఎడ్ల సాగర్,పుప్పాల సతీష్,గురువేష్ , కార్యకర్తలు గడప గడపకి తిరుగుతూ మంథనిలో రాజకీయ మార్పు కోరుకోవాలని రానున్న ఎన్నికల్లో సునీల్ రెడ్డి కి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.