నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన పి.ఎస్.అర్
జగిత్యాల,మార్చి 2 ( కలం శ్రీ న్యూస్ ): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన తాటిపెల్లి రమ కూతురు హర్షిత గత 10 రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్త గురువారం భారాస పార్టీ రాష్ట్ర నేత, వెల్గటూరు మాజీ మండలాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస రావు కు సదరు విషయాన్ని తెలుపగా 5000 నగదు, నిత్యావసరాలు, బియ్యం బస్తా, సముద్రాల రమేష్ ద్వారా అందించారు. ఆపదలో ఉన్న తమ కుటుంబానికి ఆర్థిక చేయూత నందించిన శ్రీనివాస రావు కు జీవితాంతం ఋణ పడి ఉంటామని బాధిత కుటుంబం ధన్యవాదములు తెలిపారు.