ప్రారంభానికి ముస్తాబైన బొక్కలవాగు రెండో వంతెన
నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్
మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్): మంథని పట్టణంలోని బొక్కలవాగుపై నూతనంగా నిర్మించిన రెండో వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. 2017లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. మంథనిలో వాహనాల రాకపోకలు, రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు ఆలోచన చేసి రెండో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించగా ఇటీవలి కాలంలోనే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం మంథని, రామగిరి మండలంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధు, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు వంతెన ప్రారంభ ఏర్పాట్లను మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ పర్యవేక్షించారు. వంతెనను మున్సిపల్ సిబ్బందిచే శుభ్రం చేయించారు. నేడు బొక్కలవాగుపై రెండో వంతెన ప్రారంభం కానున్న నేపధ్యంలో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.