Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్సీనియర్ పాస్టర్ మాణిక్యం ఆకస్మిక మృతి 

సీనియర్ పాస్టర్ మాణిక్యం ఆకస్మిక మృతి 

సీనియర్ పాస్టర్ మాణిక్యం ఆకస్మిక మృతి 

ప్రత్యేక ప్రార్థనల మధ్య అంత్యక్రియలు 

మంథని,జూన్ 4(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరం సీనియర్ పాస్టర్ పల్లె మాణిక్యం శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో మంథని నియోజకవర్గం లోని క్రైస్తవులు విషాదంలో మునిగారు.ఆదివారం క్రైస్తవ సంఘ పెద్దలు,సోదరులు ప్రత్యేక ప్రార్థనలతో సీనియర్ పాస్టర్ మాణిక్యంకు అంతక్రియల కార్యక్రమం నిర్వహించారు. మంథని నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పాస్టర్ పల్లె మాణిక్యం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు.గత 20 సంవత్సరాలుగా మాణిక్యం పాస్టర్ దైవ సేవలో విశిష్టమైన పాత్ర పోషించారు.క్రైస్తవ మతంలో విశిష్ట సేవలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఆకస్మికంగా శనివారం రాత్రి మంథని పట్టణం పవర్ హౌస్ కాలనీ లోని తన స్వగృహంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆదివారం మంథని నియోజకవర్గంలో పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమ క్రియలకు హాజరయ్యారు.పాస్టర్ మాణిక్యం మృతి క్రైస్తవ లోకానికి చాలా బాధాకరమని పాస్టర్ వల్లూరి ప్రభాకర్,సంఘ పెద్దలు అంకరి కుమార్ మాణిక్యం చేసిన దైవ సేవలు గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంకే జోసఫ్, మంథని ప్రసాద్,అందే రమేష్, దాసరి సదానందం,చింతకుంట్ల ప్రేమ్ కుమార్ తో పాటు పాస్టర్లు సంఘ పెద్దలు,విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!