అప్పుల భాధ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
సుల్తానాబాద్,ఏప్రిల్21(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన పోగుల సంపత్ కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి రాజ మల్లమ్మకు డబ్బులు అప్పుగా ఇవ్వగా ఆమె కొన్ని చెల్లించగా మరికొన్ని ఇవ్వాల్సి ఉండగా పోగుల సంపత్ రాజమల్లమ్మను డబ్బులు కట్టమని వేధించగా వేధింపులు భరించలేక రాజ మల్లమ్మ క్రిమి సంహారక మందు త్రాగడంతో వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ తరలించి చికిత్స పొందుతూ ఉండగా మృతి చెందింది. మృతురాలి కుమారుడు పోగుల ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.