కాంగ్రెస్ వీడిన బామ్లానాయక్ తండా సర్పంచ్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 17 (కలం శ్రీ న్యూస్):ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలపర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం బామ్లానాయక్ తండా గ్రామసర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డ్ సభ్యుల తో కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం వెల్గటూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్పంచ్ రాజునాయక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృధ్దితో పాటు సీఎం కేసీఆర్ సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు రాజునాయక్ తెలిపారు.