బీజేపీ పార్టీలో చేరిన ఎక్లాస్ పూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులు జెట్టి శంకరయ్య
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 1( కలం శ్రీ న్యూస్):బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు,జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే,ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన మంథని మండల ఎక్లాస్ పూర్ ( నెల్లిపల్లి ) గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జెట్టి శంకర్, కార్యదర్శి జెట్టి చంద్రయ్య బీజేపీ పార్టీలో చేరారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోది సుపరిపాలన, అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ఉద్యమ నాయకులు, విద్యావంతుడు సునీల్ రెడ్డి తో పనిచేయాలని మంథని అభివృద్ధికి పాటుపడాలని,బిజెపి పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు.