షెడ్యూల్ కులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 25 (కలం శ్రీ న్యూస్): ఈ పార్లమెంటు సమావేశాలలొనే షెడ్యూల్ కులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి డిమాండ్ చేస్తున్నాం అన్నారు.లేని పక్షాన మాదిగ,మాదిగ ఉప కులాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ మంగళవారం మంథని టౌన్ కమిటీని ఎన్నుకున్నారు.అద్ద్యక్షులుగా అరేపెల్లి రాజేష్ కన్న మాదిగ, ఉపాధ్యక్షులుగా మంథని వెంకటేష్,మంథని బాలకృష్ణ,ప్రధానకార్యదర్శిగా మంథని నాగరాజు,కోశాధికారిగా చిప్పకుర్తి మారుతి,నల్లగొండ తరుణ్ లను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంథని మండల ఇంచార్జ్ మంద రవి కుమార్ మాదిగ,మంథని చందు,ఏ ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ సింగారపు సుధాకర్, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి మంథని లింగయ్య, ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ బెజ్జల అనిల్,మంథని రాజేశం,ఎల్పుల శ్రవణ్,సింగారపు శంకర్, నేదురు రవి,ఇరుగురాల వేణు,లడ్డు తదితరులు పాల్గొన్నారు.