Friday, October 18, 2024
Homeతెలంగాణఘనంగా శ్రీమాన్ రఘునాథ చార్య స్వామి వారి తిరు నక్షత్ర వేడుకలు

ఘనంగా శ్రీమాన్ రఘునాథ చార్య స్వామి వారి తిరు నక్షత్ర వేడుకలు

ఘనంగా శ్రీమాన్ రఘునాథ చార్య స్వామి వారి తిరు నక్షత్ర వేడుకలు

పెద్దపల్లి,మే09,(కలం శ్రీ న్యూస్):మహా మహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి, శాస్త్ర రత్నాకర, ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ చార్య స్వామి వారి తిరునక్షత్ర వేడుకలు మంగళ వారం వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆవరణ లో ఉన్న  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ తిరునక్షత్ర ప్రత్యక్ష పూజా కార్యక్రమాలను, పారాయణాలు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమాన్ రఘునాథ చార్యుల వారి సమీప బంధువు అయిన వనజా దేవి వెంకటరమణ దంపతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చక దంపతులు శ్రీ జగన్నాథచార్యుల వారికి వనజాదేవి దంపతులు నూతన వస్త్రాలను బహుకరించారు. రఘునాథ స్వామి వారి తిరునక్షత్ర వేడుకలకు హాజరైన వారందరికీ పులిహోర, దద్దోజనం, సిరా, తదితర ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామి వారి తిరునక్షత్ర వేడుకలు నిర్వహించిన వనజాదేవి, అర్చకులు జగన్నాథచార్యులు మాట్లాడుతూ ప్రస్తుత వైష్ణవ పీఠాధిపతి చిన్న జీయర్ స్వామి వారి తో పాటు అనేక మంది వైష్ణవ జీయర్లకు, మఠాధిపతులకు శ్రీమాన్ రఘునాథాచార్యుల స్వామి వారు ఆచార్యులుగా ఉండి వారికి ఉపదేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆలయ చైర్మన్ బొంకూర్ శంకర్ తోపాటు వికాస తరంగిణి ప్రతినిధులు సాదుల భాస్కర్, లతా, సుగుణాకర్, హరికృష్ణ, శ్రీనివాస్, సంతోష్, విశ్వనాథ్, నాంపల్లి పద్మ, సుగుణ, ధన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!