ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి…
బూడిద గణేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి …
మంథని, మే 4(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాదిహామి పనులను గురువారం ఆయన పరిశీలించాడు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన పనులకు నెల రోజులుగా బిల్లు లు రాకపోవడంతో ఇక్కడి పేద ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. నెలల తరబడి ఉపాధి హామీ పనుల బిల్లులు పెండింగ్లో ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రోజులవారిగా పే స్లిప్పులు ఇవ్వటం లేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీరం చేస్తూ పేదవాడికి అందకుండా చేస్తుందని విమర్శించారు.పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఉపాధి కూలీలతో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు మంథని వెంకటి,రామగుండం మల్లయ్య, రవీందర్,శంకర్,రాజమ్మ,శంకరమ్మతదితరులు ఉన్నారు.