షడ్రుచులతో సంపూర్ణ ఆరోగ్యం
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
వాకర్స్కు ఉగాది పచ్చడి పంపిణీ
మంథని, మార్చి 22(కలం శ్రీ న్యూస్):శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని మంథని పట్టణంలోని కళాశాల మైదానంతో వాకర్స్కు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఈసందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆరు రకాల రుచుల మిశ్రమంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని,తీపి, పులుపు,చేదు, వగరు, కారం, ఉప్పు కలయికతో చేసిన రుచుల మాదిరిగానే జీవితంతో కష్టాలు,సుఖాలు, సంతోషం, దుఖంలాంటివాటిని జయించాలని, ఈ కొత్త సంవత్సరంతో ప్రతి ఒక్కరి జీవితాలు షడ్రుచుల తరహాలో ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆరు రకాల రుచులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన ఈసందర్బంగా షడ్రుచుల విశిష్టతను వివరించారు. అలాగే మంథని నియోజకవర్గ ప్రజలకు ఈ ఏడాది సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఈ సందర్బంగా కోరుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.