జిల్లా ప్రజా పరిషత్ డైరీ ఆవిష్కరణ
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 16(కలం శ్రీ న్యూస్):మంథని లో పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు రూపొందించబడ్డ జిల్లా ప్రజా పరిషత్ పెద్దపెల్లి-2023′ డైరీ లను గురువారం మంథని మండల పరిషత్ ఎంపీపీ చాంబర్ యందు మంథని ఎంపీపీ కొండా శంకర్ ,పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి,ఎంపీడీఓ రమేష్ లకు అందిస్తూ వీరితో పాటు మండలంలోని ఎంపీటీసీ లకు ఇవ్వవలసిన డైరీలను ఎంపీపీ కొండ శంకర్ కి,అదేవిధంగా సర్పంచ్ లకు ఇవ్వవలసిన డైరీలను మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కనవేన శ్రీనివాస్ కి మంథని జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఓదాల సర్పంచ్ ఎడ్ల బాపు, అక్కేపెల్లి సర్పంచ్ రాజయ్య, నగరంపల్లి సర్పంచ్ అలుగువెల్లి వీరారెడ్డి, ఉప్పట్ల సర్పంచ్ బడికల నర్సయ్య, లక్కేపూర్ ఉపసర్పంచ్ బందెల శ్రీనివాస్,మల్లెపళ్లి సర్పంచ్ తిరుపతమ్మ రవి గార్లు పాల్గొన్నారు.