Tuesday, September 17, 2024
Homeతెలంగాణమట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ..

మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ..

మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ..

సుల్తానాబాద్,సెప్టెంబర్6(కలం శ్రీ న్యూస్):

వినాయక చవితి సందర్భంగా శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో లయన్ వలస స్వరూప-నీలయ్య సౌజన్యంతో మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ మార్కండేయ దేవాలయంలో 200 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్థాయని, స్వచ్ఛమైన మట్టితో చేసిన విగ్రహాలు పవిత్రతకు, ఆధ్యాత్మికతకు దోహదం చేస్తాయని తెలుపుతూ..ప్రజలందరికీ మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్ దేవాలయ కమిటీ సభ్యులు భాస్కర్, లింగమూర్తి, కిషన్, రవీందర్, శంకరయ్య తోపాటు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!