Tuesday, September 17, 2024
Homeతెలంగాణపోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

పోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

పోచమ్మ తల్లి బోనమెత్తిన చిన్నారి సుంక సహస్ర

సుల్తానాబాద్, జులై 28 (కలం శ్రీ న్యూస్ ):

ఆషాడ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ లో సీనియర్ జర్నలిస్ట్ ,టీ.డబ్ల్యూ.జె.ఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ కూతురు చిన్నారి సుంక సహస్ర గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదివారం పోచమ్మ తల్లి బోనం ఎత్తి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సమర్పించుకుంది. ఈ సందర్భంగా సుంక సహస్ర పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను అని, ఊరు, వాడలను సల్లంగ సూడు తల్లీ అని ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించి కోరుకుంది. ఈ కార్యక్రమంలో సత్యమ్మ, వాసవి ,సాయి సత్యక్, శ్యామ్, రమ్య, రుత్విక్ సాయి,అన్విత్ సాయి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!