Tuesday, September 17, 2024
Homeతెలంగాణమానవత్వం పరిమళించిన వేళ.....

మానవత్వం పరిమళించిన వేళ…..

మానవత్వం పరిమళించిన వేళ…..

సుల్తానాబాద్,జులై28(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్తలు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరోసారి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలకు వెళ్తే ఎలిగేడు మండలం బుర్హాన్ మియా పేట్ గ్రామానికి చెందిన అక్కినపల్లి శ్రీనివాస్- శ్రీలత లు వడ్రంగి పని చేసుకుంటూ పొట్ట చేత పట్టుకొని గత 15 సంవత్సరాల క్రితం సుల్తానాబాద్ కు వచ్చారు. తనకు ఇద్దరు కూతుర్లు కలరు. శ్రీనివాస్ గత నెల 12న రాజీవ్ రహదారి గుండా వెళుతూ ఉండగా అనుకోకుండా వాహనం వచ్చి ఢీకొట్టడంతో తను 15 రోజులపాటు కోమాలో ఉండి మరణించాడు. ఈ సంఘటన తెలుసుకున్న సుల్తానాబాద్ పట్టణ సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు ఆ నిరుపేద కుటుంబం కి ఇద్దరు పాపలు కావడంతో వారిద్దరి అమ్మాయిలకు పేరు మీద కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినా పోస్ట్ ఆఫీస్ లో కేవీపీ పాలసీదార ఇద్దరు అమ్మాయిలకు చెరి 5000 రూపాయలు డిపాజిట్ గా చేసి ఆ పాస్ బుక్ లను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ , శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!