Saturday, July 27, 2024
Homeతెలంగాణబార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పడాల శ్రీరాములు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పడాల శ్రీరాములు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పడాల శ్రీరాములు

సుల్తానాబాద్,మార్చి28(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలను గురువారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో 43 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి ఆలూరి శ్రీనివాసరావు, పడాల శ్రీరాములు పోటీపడగా పడాల శ్రీరాములు కు 29 ఓట్లతో అధ్యక్షుడు గా విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి బోయిని భూమయ్య, జోగుల రమేష్, వేపూరి తిరుపతి లు పోటీ పడగా జోగుల రమేష్ 23 ఓట్లతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా పెగడ శ్యాం సుందర్, సంయుక్త కార్యదర్శిగా సామల రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా చీకటి సంతోష్ కుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా వడ్లకొండ రవికిరణ్, లైబ్రరీ కార్యదర్శిగా అవుల శివ కృష్ణ, మహిళా ప్రతినిధి గా పి. సంధ్యారాణి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా లక్ష్మీరాజం, బాలకిషన్ ప్రసాద్, పబ్బతి లక్ష్మీకాంత్ రెడ్డి, అకారపు సరొత్తంరెడ్డి, వోడ్నాల రవీందర్, అవునూరి సత్యనారాయణ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మల్యాల కరుణాకర్, తాళ్ళపల్లి లక్ష్మణ్, అరెల్లి రాములు, వంగల యుగంధర్ రెడ్డి, బొబ్బిలి శ్యాం, గుడ్ల వెంకటేష్ లను ఎన్నుకున్నారు. పడాల అంజయ్య, రుద్రారపు నర్సయ్య ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!