పేదింటి అమ్మాయి వివాహానికి చేయూత
సుల్తానాబాద్,మార్చి12(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజిక సేవకులు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి- సత్యనారాయణ దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణానికి చెందిన పేదింటి అమ్మాయి నిట్టూరి సుచిత వివాహానికి తమ వంతు చేయూత అందించారు. మంగళవారం మీ నేస్తం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సామల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నిట్టూరి శారద స్వామీ ల కూతురు సుచిత వివాహానికి అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు 3 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు అమ్మాయికి చీరను బహూకరించారు. ఈ సందర్బంగా పేదింటి అమ్మాయి వివాహానికి చేయూత అందించిన అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు సామల రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.