Saturday, July 27, 2024
Homeతెలంగాణకరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్,ఫిబ్రవరి 20(కలం శ్రీ న్యూస్):కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం పూరిళ్ల నుంచి మంటలు చెలరేగాయి.ఐదు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంట లను ఆర్పేశారు.పూరిళ్లలో నివసించేవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!