Saturday, July 27, 2024
Homeతెలంగాణబందుల పేరు చెప్పి రాబందుల్ల పీక్కు తింటున్న ఈ దొంగ పాలకులను తరిమికొట్టండి.

బందుల పేరు చెప్పి రాబందుల్ల పీక్కు తింటున్న ఈ దొంగ పాలకులను తరిమికొట్టండి.

బందుల పేరు చెప్పి రాబందుల్ల పీక్కు తింటున్న ఈ దొంగ పాలకులను తరిమికొట్టండి.

సుల్తానాబాద్,నవంబర్26(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని 2వ వార్డ్ పాత జెండా వద్ద బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష  గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి బిఎస్పీ మేనిఫెస్టో లోని సంక్షేమ పథకాలను వివరిస్తూ మేనిఫెస్టో కరపత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బందుల పేరు చెప్పి రాబందుల పిక్కు తింటున్న ఈ దొంగ పాలకులను తరిమికొట్టాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన చింతకుంట విజయ రమణారావు లు సొంత వ్యాపారాల కోసమే రాజకీయాలు చేస్తున్నారే తప్ప పెద్దపల్లి ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పెద్దపల్లి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.

అనంతరం బీఎస్పీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రతి నిరుపేద బహుజనులకు ఎకరం భూమి మహిళా పేరు మీద పట్టా చేస్తాం అని,ఇల్లు లేని వారికి 550 గజాల భూమి ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల నగదు, ఇల్లు రిపేరుకు 1,50,000/- రూపాయలు ఇస్తామని,ప్రతి మహిళకు, కార్మికులకు ఉచితంగా వాషింగ్ మిషన్, కుట్టు మిషన్, డ్రైవింగ్ ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని,టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ ద్వారా లీకేజీ లేకుండా 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం అందులో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని,150 రోజుల ఉపాధి హామీ కల్పించి రోజువారి కూలి 350 రూపాయలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, పెద్దపల్లి మండల మాజీ జడ్పిటిసి ఈర్ల కొమరయ్య, పెద్దపల్లి మండల జడ్పిటిసి బండారి రామ్మూర్తి, మండల కోశాధికారి అల్లేపు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు తోట మధు, కొండ రజిత, గడ్డo అంజయ్య, సింగసాని అనిల్, మనోహర్, సంజీవ్, అల్లెపు శృతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!