Saturday, July 27, 2024
Homeతెలంగాణమృతుడి  తల్లికి ఆర్థిక సహాయం 

మృతుడి  తల్లికి ఆర్థిక సహాయం 

మృతుడి  తల్లికి ఆర్థిక సహాయం 

ఎలిగేడు,నవంబర్24(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన దేవరాజు గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మృతుడికి వృద్దురాలైన తల్లి ఉంది. గుంట భూమిలేని నిరుపేద కుటుంబానికి చెందిన రాజు మృతితో ఆ వృద్ధురాలైన తల్లి అనాధగా మారింది. దహన సంస్కారాలకు, కర్మకాండలకు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వారిది. ఇట్టి విషయాన్ని ధూళికట్ట గ్రామ కమిటీ వాట్స్అప్ గ్రూప్ లో గ్రూప్ అడ్మిన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పోస్ట్ పెట్టి దాతల నుండి ఆర్థిక సాయం అందించవలసిందిగా కోరడంతో.. స్పందించిన వాట్సాప్ గ్రూప్ మిత్రులు, ఇతర దాతల నుండి  14.200 రూపాయలు విరాళాలు సేకరించి వృద్ధురాలైన తల్లికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇట్టి మానవతా సేవా కార్యక్రమంలో పాలుపంచుకున్న గ్రూపు మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఇతర దాతలు కూడా వారికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవ శ్రీనివాస్,సిహెచ్ శ్రీనివాస్, భూసారపు ఎల్లయ్య, దేవరాజు, ఎర్ర మల్లేశం, వీరగోని పరుశరాములు, దేవ అనిల్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!