Saturday, July 27, 2024
Homeతెలంగాణగులాబి జెండా పేదలకు అండ...ఎమ్మెల్యే దాసరి

గులాబి జెండా పేదలకు అండ…ఎమ్మెల్యే దాసరి

గులాబి జెండా పేదలకు అండ…ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్,నవంబర్19(కలం శ్రీ న్యూస్):ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి,కొదురుపాక గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు.అనంతరం మాట్లాడుతూ గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేసారన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6 వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భారాస సీనియర్ నాయకులు జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ పాల రామారావు, ఎంపీపీ పొన్నామనేని బాలాజీ రావు,మార్కెట్ ఛైర్మెన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజ మల్లయ్య ,పాక్స్ ఛైర్మెన్ జూపల్లి సందీప్ రావు, సూర శ్యామ్ ,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సుజాత – రమేష్,అశోక్ రావు,సర్పంచ్ కోమల – సారయ్య,ఉప సర్పంచ్ లు స్వరూప – గంగయ్య,మహేందర్,గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్,కందుకూరి సురేష్,మాజీ ఎంపీటీసీ ఉత్తమకుమారి,యూత్ ఇరుగురాల సాగర్, సాగర్ రావు,అజయ్,అట్ల సాగర్, పోలవేణి శ్రీనివాస్, తిర్రి సాగర్, తిర్రి మధుసూదన్, తూముల రామస్వామి, కనకయ్య, కుమారస్వామి,వార్డు మెంబర్ లు అట్ల వనిత శ్రీనివాస్ ,లోకిని మల్లమ్మ, తిర్రి రమేష్, అట్ల సత్యనారాయణ, వానరాసి వసంత, వానరాసి సారయ్య, లోకిని శ్రీనివాస్, చాతారాజు శ్రీనివాస్, సట్టు మహేష్, భూషణవేణి కవిత – డైరెక్టర్ విజయ్, చుంచుల వర్షిత – రాకేష్, నాయకులు కొయ్యడ అరుణ్, వడ్కాపూర్ ఆంజనేయులు, పడాల తిరుపతి, ఆకుల శ్రీనివాస్, వెంకట్రాజం ,తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!